
- ఇద్దరు అరెస్ట్..
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఆదివారం రెండు చోట్ల రూ.8 లక్షల విలువైన 203 గ్రాముల ఓజీ కుష్ పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అసిస్టెంట్కమిషనర్ఫోర్స్సీఐ మహేశ్ , టీం సభ్యులు అమీర్పేట్, నాంపల్లి ప్రాంతాల్లో ఆదివారం దాడులు నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో చల్లా నారాయణ శ్రీనిధి అనే వ్యక్తి వద్ద 101 గ్రాముల ఓజీ కుష్ పట్టుకున్నారు. నాంపల్లిలో నరేందర్ కుమార్ దగ్గర 102 గ్రాముల ఓజీ కుష్ దొరికింది.